మహిళా సాధికారత జనసేన-టీడీపీలతోనే సాధ్యం: పెండ్యాల శ్రీలత

• 28వ రోజు 7వ డివిజన్ నీరుగంటి వీధిలో కొనసాగిన మహిళలతో మాటామంతి

అనంతపురం, జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ మహిళా కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా అనంతపురం అర్బన్ నియోజకవర్గం లోని స్థానిక 7వ డివిజన్ నీరుగంటి వీధిలో పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేన-టీడీపీ పార్టీలకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం మహిళల ఆర్థిక పురోగాభి వృద్ధిని ఏమాత్రం పట్టించుకోలేదని, వారి ఆర్థిక ఎదుగుదలకు ఏమాత్రం కృషి చేయకుండా రాష్ట్ర స్థూల ఆదాయంలో మహిళల వాటా ఏమాత్రం లేకుండా చేసారని, దీనికి తోడు డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేసి వారి సాధికారతను దెబ్బతీసాడని, జగనన్న పాలవెల్లువ వల్ల మహిళలకు ఓరిగింది ఏమి లేదని కనుక మహిళలంతా ఈ విశయాలన్ని గ్రహించాలని జనసేన-టీడీపీ పార్టీలతోనే మహిళలకు సముచితమైన సాధికారత లభిస్తుందని వారి ఆర్థిక ఆత్మగౌరవం పెంపొందించేందుకు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు ప్రత్యేక చొరవ తీసుకుంటారని అన్నారు. వీటితో పాటు స్థానిక డివిజన్ లో పందుల స్వైర విహారం చేస్తున్నాయని, గడిచిన నెల నుంచి మంచినీరు ఏమాత్రం రావడం లేదని అయినప్పటికీ స్థానిక వైకాపా కార్పొరేటర్ ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.