ధర్మ రక్షా నిధికి విరాళం ఇచ్చిన యల్లటూరు

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం (యల్లటూరు భవన్) నందు విశ్వహిందూ పరిషత్ కార్యవర్గ సభ్యులు రాజంపేట జనసేన నేత యల్లటూరు శ్రీనివాస రాజుని మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ధర్మ రక్షా నిధికి యల్లటూరు శ్రీనివాస రాజు విరాళం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ కాకర్ల రాముడు, జిల్లా అధ్యక్షులు పోకల ప్రభాకర్, సెక్రటరీ శ్రీనివాసుల నాయుడు, కార్యదర్శి రెడ్డయ్య రాజు, నియోజకవర్గ అధ్యక్షులు సుధాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు.