వైసీపి ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం – పరిపాలనలో శూన్యం: శ్రీమతి పోలసపల్లి సరోజ

కాకినాడ రూరల్ నియోజకవర్గం, కరప మండలం, యండమూరు గ్రామంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు కాకినాడ ప్రధమ మేయర్ శ్రీమతి పోలసపల్లి సరోజ, తెలుగుదేశం పార్టీ మాజీ శాసనసభ్యులు శ్రీమతి మరియు శ్రీ పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి పన్నెండవ రోజు ఇంటింటికి పర్యటించి జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన కరపత్రాలను పంచుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్బంగా నియోజకవర్గ ప్రజలు అక్కడి ఇబ్బందులను వివరించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి పోలసపల్లి సరోజ మాట్లాడుతూ వైసీపి ప్రభుత్వం ప్రచారానికే ప్రాధాన్యం – పరిపాలనలో శూన్యం అని, ఎక్కడ చూసినా ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేశారని. ప్రభుత్వం మారాలి ఈ పరిపాలన మారాలి అని వారు వాపోయారు. జగన్ అనే నరకాసుర వధ జరగాలి, అప్పుడే ఈ రాష్ట్రానికి నిజమైన దీపావళి అని అవినీతి, అక్రమాల కొలువైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించే దిశగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాబోయే జనసేన-తెలుగుదేశం సంకీర్ణ ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందనీ, ప్రజలకు కావాల్సిన కనీస అవసరాలు సత్వరమే అందుతాయని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.