గిరిజనులకు ద్రోహం చేస్తున్న వైసీపీ జగన్ రెడ్డి: చిర్రి బాలరాజు
- నిద్రపోతున్న పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు.
- బోయ,వాల్మీకి కులస్తులను ఎస్టిలో చేర్చాలని తీర్మానం.
- దళిత క్రైస్తవులను ఎస్సిలలో చేర్చాలని మరో ప్రయత్నం.
- తీవ్రంగా ఖండించిన జనసేన పోలవరం ఇంఛార్జి చిర్రి బాలరాజు.
- అసెంబ్లీలో కీలక తీర్మానం.
పోలవరం నియోజకవర్గం, ఎస్టి కోయ రిజర్వడ్ నియోజకవర్గం ఈరోజు గిరిజనులు ఆర్ధికంగాను అభివృద్ధిలో గానీ ఇంకా వెనుకబడే ఉన్నారు. ఇంతకు ముందు ఉన్న ప్రభుత్వాలు వేరే వర్గాల వాళ్ళను తీసుకువచ్చి ఎస్టిలలో కలపడం వల్ల ఉద్యోగాల పరంగా గానీ రిజర్వేషన్ పరంగా గానీ అసలు కోయ వారు అణగారిపోయారు. గిరిజనుల సంస్కృతిని పాటించుకుంటు ఇంకా అటవీ ప్రాంతాలలో నివసిస్తూ ఏ పాపం పుణ్యం తెలియని గిరిజన జాతిని ఈ విధంగా అసెంబ్లీలో తీర్మానాలు చేస్తునటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డికి సరికాదు అని గిరిజనులను ఇంత అన్యాయం చెస్తునటువంటి వారు శిక్ష అనుభవిస్తారని జనసేన పార్టీ పోలవరం ఇంఛార్జి చిర్రి బాలరాజు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అసెంబ్లీలో గిరిజనులను నాశనం చేసే తీర్మానాలు చేస్తున్న గిరిజనుడు అయ్యి నోరుమెదపకపోవడం సిగ్గు చేటు అని, ఇలాంటి వారికి గిరిజనులు రానున్న రోజులలో తప్పకుండా బుద్ది చెప్తారని ఆయన ఎద్దేవా చేశారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-24-at-21.40.08.jpeg)