జనసేనానిని మర్యాదపూర్వకంగా కలిసిన మర్రాపు సురేష్, డా.మిడతాన

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గంలో దశాబ్ధాలుగా నెలకొన్న సమస్యలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృషికి జనసేన నేతలు మర్రాపు సురేష్, డా.మిడతాన రవి కుమార్ తీసుకెళ్లారు. ఇటీవల పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు. ఈ సందర్భంగా గజపతినగరం నియోజకవర్గ సమస్యలతో పాటు విజయనగరం జిల్లా వ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు, మౌలిక సదుపాయల కల్పనలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని అధ్యక్షులకు వివరించారు. జిల్లా సమస్యలపై పార్టీ అధ్యక్షులతో చర్చించారు. అనంతరం పవన్ కళ్యాణ్ గారిని శాలువాతో సత్కరించి, హనుమంతులవారి విగ్రహాన్ని అందించారు.