వంద బెడ్స్తో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు చేయనున్న యువరాజ్సింగ్ ఫౌండేషన్
భారత మాజీ క్రికెటర్ యువరాజ్సింగ్.. కోవిడ్ బాధితులను ఆదుకోవడానికి ముందుకొచ్చారు. వారి కోసం ప్రత్యేకంగా.. 100 బెడ్లతో కోవిడ్ ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు నడుం బిగించారు. ఈ ఆసుపత్రిని యువరాజ్సింగ్ ఫౌండేషన్ నిర్మించనుంది. ఈ విషయాన్ని మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఉన్న మహాత్మా గాంధీ మెమోరియల్ మెడికల్ కాలేజీ డీన్ సంజరు దీక్షిత్ తెలిపారు. యువరాజ్ సింగ్ ఫౌండేషన్ నుంచి తమకు ఓ లేఖ అందిందని, 100 బెడ్స్ కోవిడ్ హాస్పిటల్కు ఏర్పాటు కావాల్సిన సదుపాయాలను కల్పించేందుకు తాము సిద్దంగా ఉన్నట్లు యువీ ఫౌండేషన్ ఆ లేఖలో తెలిపినట్లు ఆయన వెల్లడించారు. కాగా, ఆ హాస్పిటల్ నిర్మాణం కోసం వారు 30 రోజుల వ్యవధి కోరినట్లు చెప్పారు. యువీ ఫౌండేషన్ పంపిన లేఖను ఆమోదించినట్లు ఎంజీఎం మెడికల్ కాలేజీ డీన్ సంజరు దీక్షిత్ తెలిపారు.