దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని ఆలూరు నియోజకవర్గం!: తెర్నేకల్ వెంకప్ప

ఆలూరు నియోజకవర్గం: హోలగుంద మండలం పర్యటనలో భాగంగా రాళ్లచేను కాలనీలో జనసేన పార్టీ ఆలూరు నియోజకవర్గం ఇంచార్జ్ తేర్నేకల్ వెంకప్ప సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకప్ప మాట్లాడుతూ.. ఇక్కడ ప్రజలు ముఖ్యంగా చెప్పిన సమస్యలు సీసీ రోడ్లు, కరెంటు స్తంభాలు, సరైన గృహాలు లేకపోవడం. కార్మిక శాఖ మంత్రివర్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారు గడపగడపకు రాలేదా అని అడగగా వాళ్లకి సమస్యలు పట్టించుకోని తీరిక ఓపిక ఉంటే బాగుండేది అని అన్నారు. ఇక్కడున్న ప్రజలు స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే 2024లో వైఎస్సార్సీపీకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వేసే ప్రసక్తే లేదని సెలవిచ్చారని అన్నారు. మంత్రి జయరాం గారు మరియు వైసీపీ నాయకులు సెటిల్మెంట్లు, కర్ణాటక మద్యంతో వాళ్ళ సంపద పెంచుకోవడంలో ఉన్న శ్రద్ధ వారి సమస్యల పరిష్కరించడంలో పెట్టుంటే నియోజకవర్గం అభివృద్ధి చెందేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు అశోక్, విరేష్, గురునాథ్, గంగాధర్, చిన్న, హరున్ బాషా, విరేశ్, మల్లికార్జున, మల్లి, జలల్, మల్లయ్య మరియు టీడీపీ హోలగుంద మండల కన్వీనర్ తిప్పయ్య, రాష్ట్ర మైనార్టీ కార్యనిర్మాణణ కార్యదర్శి ఆదం, ఐటీడీపీ తాలూకు కార్యదర్శి హనుమంతు, కాకి సీతయ్య, ఎస్ పంపన్న, తిక్క స్వామి, టిఎన్ఎస్ఎఫ్ మళ్లీ, సిబిఎన్ ఆర్మీ మోహిన్, టిడిపి సీనియర్ నాయకులు బసప్ప మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *