ప్రవాసాంధ్రుల ప్రోత్సాహం మరువలేనిది

* గల్ఫ్ జన సైనికులు, వీర మహిళలు అందించిన ఆతిథ్యం ఆస్ట్రేలియా జ్ఞాపకాలను గుర్తు చేసింది
* భవిష్యత్తు తరాల కోసం మనమంతా కలిసి కట్టుగా పనిచేద్దాం

జనసేన పార్టీ బలోపేతం కోసం విదేశాల్లో స్థిరపడిన భారతీయులు, ముఖ్యంగా ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించారు. భవిష్యత్తు తరాల కోసం మనమంతా కలిసి కట్టుగా పనిచేద్దాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తిని కొనసాగిద్దాం. గత మూడు రోజుల పాటు గల్ఫ్ జన సైనికులు, వీర మహిళలు అందించిన ఆతిథ్యం ఆస్ట్రేలియా పర్యటన జ్ఞాపకాలను మరొక్కసారి గుర్తు చేసింది. అజ్మాన్ నగరంలో “దుబాయ్ – యూఏఈ” జనసేన పార్టీ కార్యాలయం ఏర్పాటు చేయడం, అది నా చేతులమీదుగా ప్రారంభించడం అంతులేని అనుభూతినిచ్చింది. గల్ఫ్ దేశాల కార్యకర్తల కోసం కార్యాలయం నిర్మించిన శ్రీ కేసరి త్రిమూర్తులు గారికి ప్రత్యేక అభినందనలు. సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యాలయం నిర్వహించబడడం అనేది అందరికీ ఉపయోగకరం. గల్ఫ్ దేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయుల కోసం జనసేన హెల్ప్ లైన్ కూడా ఏర్పాటు చేయడం సంతోషకరం. వీర మహిళల సమావేశంలో సామాజిక ఉద్యమకారిణి, దూబగుంట సారా నిషేధ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన శ్రీమతి టీ. మణి చలపతి గారి ప్రసంగం స్ఫూర్తినిచ్చింది. దుబాయిలో మొక్క నాటిన అనుభవం నాకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సొంత అక్క చెల్లెళ్ళులా వీర మహిళలు చూపించిన అభిమానం గొప్పది. గతంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న రోజుల్లో ప్రవాస భారతీయులు వారి స్వస్థలానికి రాలేని పరిస్థితుల్లో గల్ఫ్ దేశాల్లో ఉన్న జన సైనికులు, వీర మహిళలు ప్రత్యేకంగా విమానాలు ఏర్పాటు చేసి వారిని తరలించిన విధానం ఎప్పటికీ మర్చిపోలేనిది. తెలుగు రాష్ట్రాల్లో లెక్కబెట్టలేనన్ని సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిచ్చిన సందర్భాలు ఎంతో విలువైనవి. జనసేన ప్రభుత్వంలో ప్రజా ప్రయోజన పాలన కోసం ప్రవాస భారతీయుల సలహాలు, సూచనలు, అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇస్తూ పాలనలో భాగస్వామ్యం చేస్తాం. సమాజ శ్రేయస్సు కోసం పని చేస్తున్న ప్రతీ ప్రవాస జన సైనికులు, వీర మహిళలకు ప్రత్యేకమైన అభినందనలు. ప్రవాస భారతీయులు గతంలో అనేక సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో విభిన్నమైన సామాజిక సేవ కార్యక్రమాలకు చేయూతనిచ్చిన సందర్భాలు ఎంతో విలువైనవి. భవిష్యత్తు తరాల భద్రత కోసం, భరోసా కోసం మనమంతా కలిసి కట్టుగా చేస్తున్న ఈ కృషిని కొనసాగిద్దాం. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం, వ్యక్తిత్వం స్ఫూర్తిగా మున్ముందు ఇదే ఉత్సాహం, పట్టుదలతో జనసేన పార్టీని బలోపేతం చేసుకుని, జనసేన ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజా ప్రయోజన పాలన అందిద్దాం. గల్ఫ్ ఎన్.అర్.ఐ. జనసైనికులు, వీరమహిళల ఆత్మీయ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శ్రమించిన సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, ఖతార్, బహ్రెయిన్, యూఏఈ దేశాల ఐక్యవేదిక సభ్యులు కేసరి త్రిమూర్తులు, చందక రామదాసు, కంచన శ్రీకాంత్, రాంచంద్ర నాయక్, భాస్కర్ రావ్, జీ.కే. దొర, డా. హరికృష్ణ, కొండేపూడి సారంగ, కృష్ణ కిషోర్, భోసన్, రాయుడు వెంకటేశ్వర్లు, శింగురి రవికుమార్, వీర ప్రసాద్, ఉదయ్ కిరణ్, అంజన్ కుమార్, శ్రీకాంత్, ఆకుల రాజేష్, నగేష్, మూర్తి, వీరబాబు, శ్రీదర్, రవివర్మ, నారాయణ, భరత్, చంద్రశేఖర్, రునీల్, మైత్రి రవికుమార్, నాగభూషణ్, శ్రీదర్, వీర మహిళలు సునీత కొమరవులు, మంజుల మోగల్ల, లక్ష్మీ రజిత కేసరి, కొడిమండ్ల లక్ష్మీ, షీలా నీలగిరి, వాసవి బొబ్బిలి తదితరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు అని శ్రీ నాగబాబు పేర్కొన్నారు.