జనం కోసం జనసేన మహాయజ్ఞం 723వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: ఇంటికి దూరంగా – ప్రజలకు దగ్గరగా” ప్రజా సమస్యల పరిష్కారమే జనసేన పార్టీ లక్ష్యంగా శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో చేస్తున్న జనం కోసం జనసేన మహాయజ్ఞం 723వ రోజు కార్యక్రమం శుక్రవారం జగ్గంపేట మండలం సీతారామపురం మరియు గండేపల్లి మండలం యర్రంపాలెం గ్రామాలలో జరిగింది. జనం కోసం జనసేన మహాయజ్ఞం 724వ రోజు కార్యక్రమం శనివారం జగ్గంపేట మండలం మామిడాడ మరియు గుర్రప్పాలెం గ్రామాలలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జన సైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర తెలిపారు. ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల బిసి సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసు, జగ్గంపేట మండల ఉపాధ్యక్షులు తోలాటి ఆదినారాయణ, గండేపల్లి మండల ప్రధాన కార్యదర్శి తమటం నాగేంద్ర, సీతారామపురం నుండి గ్రామ అధ్యక్షులు గంధం ముత్యాలు, సుంకర గోపీ, జువ్వల సాయి, మానెల్తి మహాలక్ష్మి దేవి, రాయపాటి దుర్గారావు, యర్రంపాలెం నుండి బిక్కిన కృష్ణార్జున, రొట్టె రామకృష్ణ, రొట్టె రాజులమ్మ, యాసనుపూ శివ, శ్రీమంతుల అశోక్, కుడేల భరత్, కాకాఢ గోపికృష్ణ, మచ్చ ప్రేమ్ కుమార్ గారికి, శనగల బుజ్జి, నేలపల్లి రాజు, చెప్పుల అనిల్, కొల్లి విజయ్ కుమార్, ఉప్పలపాడు నుండి గ్రామ అధ్యక్షులు తిరణాల శ్రీమన్నారాయణ, అంకం ఓం కృష్ణ, కాట్రావులపల్లి నుండి గ్రామ అధ్యక్షులు శివుడు పాపారావు, చక్కపల్లి సతీష్, జగ్గంపేట నుండి డేగల నరేష్, సుంకర రమణ, జె.కొత్తూరు నుండి గ్రామ అధ్యక్షులు గుంటముక్కల మధు, నాయకంపల్లి నుండి గ్రామ అధ్యక్షులు అల్లాడి వీరబాబు, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్, పిన్నం మణికంఠ స్వామిలకు కృతజ్ఞతలు తెలిపారు. జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా సీతారామపురం గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యం అందించిన గంధం ముత్యాలు కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.