జనసేనతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు!

  • బడుగు బలహీన వర్గాల పేదరిక నిర్మూలన జనసేన పార్టీ లక్ష్యం
  • రాజనగరం మండలం, రఘునాథపురం గ్రామంలో జనం కోసం జనసేన, మహాపాదయాత్రకు అడుగడుగున జననీరాజనం
  • రాజానగరం నియోజకవర్గాన్ని అవినీతిరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం
  • రఘునాధపురం గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుండి పెద్ద ఎత్తున మద్దతు
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రఘునాథపురం గ్రామంలో బుధవారం నిర్వహించిన జనం కోసం జనసేన, మహా పాదయాత్రను నిర్వహించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి గ్రామ ప్రజానీకం స్వచ్ఛందంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి బత్తుల బలరామకృష్ణ గారి నాయకత్వాన్ని బలపరిచి పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నామని వారే చెప్పడం చూస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. యువత కేరింతలతో, అడుగడుగునా మహిళలు హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా ఈ మహాపాదయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో రఘునాధపురం జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు, రఘునాధపురం గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.