మహాత్ముడికి ఘన నివాళులు అర్పించిన రాష్ట్రపతి, ప్రధాని

ప్రధాని నరేంద్ర మోదీ మహాత్మా గాంధీకి నివాళి అర్పించారు. ఢిల్లీలోని రాజ్‌ఘాట్ వద్ద గాంధీ వర్ధంతి నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ రోజు పుష్పాలతో నివాళులు అర్పించారు. అంతకుముందు ఆయన తన ట్విట్టర్‌లో బాపు పుణ్య తిథి సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. బాపూజీ ఆశయాలు లక్షలాది మందికి ప్రేరణగా నిలుస్తున్నాయన్నారు. అమరుల దినోత్సవం రోజున దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలను అర్పించిన వారి త్యాగాలను గుర్తుచేసుకుంటామన్నారు. రాజ్‌ఘాట్ వద్ద రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌, ఉపాధ్యక్షుడు ఎం వెంకయ్యనాయుడు కూడా ఇవాళ బాపూజీ సమాధికి నివాళి అర్పించారు. రక్షణమంత్రి రాజ్‌నాథ్ కూడా గాంధీ వర్ధంతి సందర్భంగా నివాళి అర్పించారు.