మోతేరా స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి!

అహ్మదాబాద్‌: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈరోజు వర్చువల్‌ విధానం ద్వారా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో నిర్మించిన సర్దార్‌ పటేల్‌(మొతేరా) స్టేడియంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోమ్‌శాఖ మంత్రి అమిత్ షా, క్రీడల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పటేల్ పాల్గొన్నారు. అహ్మదాబాద్‌లోని ఈ స్టేడియాన్ని పునరుద్ధరించిన విషయం తెలిసిందే. లక్షా పది వేల సామర్థ్యంతో ఇది ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రికార్డు సృష్టించింది.