జనసేన కుటుంబానికి 5 లక్షల ఆర్థిక భరోసా

పెందుర్తి, గంగవరం, 88 వ వార్డు, పెందుర్తి నియోజకవర్గంలో కొద్ది నెలల క్రితం మరణించిన జనసైనికుడు మోటూరు అప్పారావు కుటుంబాన్ని వార్డ్ ఇంచార్జ్ వబ్బిన జనార్దన్ శ్రీకాంత్ పరామర్శించడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దూరదృష్టితో జనసేన పార్టీ కుటుంబ సభ్యులకు ఆపద వస్తే కొంత ఆర్థిక భరోసా ఉండాలని ఉద్దేశంతో జనసేన పార్టీ సభ్యులందరికీ క్రియాశీలక సభ్యత్వం ఇన్సూరెన్స్ చేయించి, అది ఈనాడు మా యొక్క వార్డులో జనసేన సభ్యుని కోల్పోగానే మా జాతీయ ప్రధాన కార్యదర్శి నాగబాబు చేతుల మీదుగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో 5 లక్షలు రూపాయలు వారి అమ్మ కొండమ్మ ఇవ్వడం జరిగిందని, జనసేన పార్టీ సభ్యులను అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చక్కగా చూసుకుంటారో ఇదొక ఉదాహరణ అని, ప్రజలందరూ కూడా ఇది గమనించి పవన్ కళ్యాణ్ కి మనమందరం సపోర్ట్ చేసినట్లయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరి బాగోగులు చూసుకుంటారు కావున మనందరం పవన్ కళ్యాణ్ నాయకత్వం బలపరిచే విధంగా పనిచేయాలని, మేమందరం కూడా ఈ ఒక కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇస్తూ, వారి కుటుంబానికి మనోధైర్యం కలగాలని ఉద్దేశంతో స్థానిక నాయకులతో కలసి పరామర్శించడం జరిగిందని వివరించారు. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు మోటూరు కనకరాజు, గంగు నాయుడు, శ్రీను, నరేష్, గోపి, ప్రసాద్, వినోద్, ప్రవీణ్, రాజు, రూపేష్ మరియు జనసైనికులు.