ఉత్తరప్రదేశ్లో కరోనా కర్ఫ్యూ పొడిగింపు
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం విధించిన పాక్షిక కర్ఫ్యూను యోగి ఆదిత్యనాథ్ సర్కార్ ఆదివారం పొడిగించింది. మరో వారం రోజుల పాటు అనగా మే 17 వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. రాష్ట్రంలో 26,847 తాజా కేసులతో పాటు 298 మంది మరణించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే యుపిలో కరోనా కేసులు 14,80, 315కు చేరుకున్నాయి. తాజా మరణాల్లో లక్నో నుండి 38, కాన్పూర్లో 23, ఝాన్సీలో 18, మీరట్లో 12, అలహాబాద్, గౌతమ్ బుద్ధానగర్, ఘాజిపూర్లో 11 చొప్పున నమోదయ్యాయి.