పెట్రో, గ్యాస్‌, నిత్యావసర సరుకులపై వామ పక్షాల నిరసన గళం..

పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర సరకుల ధరలు విపరీతంగా పెంచుతూ.. ప్రజలపై భారాలు మోపుతున్న కేంద్రంలోని బిజెపి విధానాలను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసనలు మిన్నంటాయి. పెట్రోల్‌ ధరల పెంపుకు నిరసనగా విజయవాడలో ఆందోళనలు చేపడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధును పోలీసులు అరెస్టు చేశారు.