మోహినీ అవతారంలో శ్రీవారు

కలియుగ దైవం తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజైన బుధవారం స్వామివారు మోహినీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కార్యక్రమంలో తితిదే ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి తదితరులు వాహన సేవలో పాల్గొన్నారు. రాత్రి 7గంటల నుంచి 8.30 వరకు గరుడసేవ జరగనుంది. గరుడ సేవ సందర్భంగా స్వామివారికి సీఎం జగన్‌ సాయంత్రం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.