భాను కిరణ్ ఆధ్వర్యంలో బంగ్లా సెంటర్లో క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమం ప్రారంభం

ఆత్మకూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్ సూచనల మేరకు జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఆధ్వర్యంలో సోమవారం సంగం మండలంలోని బంగ్లా సెంటర్లో (తాసిల్దార్ ఆఫీస్ ఎదురుగా) క్రియాశీలక సభ్యత్వం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది. జనసేన పార్టీ అధ్యక్షులు జనసేనని కొణిదెల పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నాయకులను మరియు కార్యకర్తలను, వీర మహిళలను, జనసైనికులను దృష్టిలో పెట్టుకొని క్రియాశీలక సభ్యత్వం అనేది పెట్టడం జరిగినది. క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి జీవిత బీమా 5,00,000/- యాక్సిడెంట్ బీమా 50,000/- అందచేయడం జరుగుతుంది. ఏ పార్టీ చేయని విధంగా జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన నాయకులు, కార్యకర్తల, వీర మహిళలు, జనసైనికులు కు అండగా నిలవాలని పవన్ కళ్యాణ్ ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని పెట్టడం జరిగినది. ఈ క్రియాశీలక సభ్యత్వాన్ని సంగం మండల పరిధిలో ఉన్న అన్ని గ్రామ పంచాయతీల్లో ఈ సభ్యత్వాన్ని తప్పనిసరిగా తీసుకునే విధంగా కృషి చేస్తామని జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గం ఉపాధ్యక్షులు దాడి భాను కిరణ్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సంగం మండల కార్యదర్శి హజరత్, సంగం మండల కార్యదర్శి గురువరాజు, సంగం మండల నాయకులు కృష్ణమోహన్, వెంకటేష్, రంతుల్లా, శ్రీను, శేషయ్య తదితరులు పాల్గొన్నారు.