ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వహించాలి

పాలకొండ నియోజకవర్గం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద మరియు ఎక్కడికి వెళ్ళినా వెంట అనుసరిస్తూ అనుమానంగా కొందరు వ్యక్తులు గత రెండు రోజులుగా తిరుగుతూ ఆయన సిబ్బందిపై గొడవలకు దిగి పక్కాగా ప్లాన్ ప్రకారం పవన్ కళ్యాణ్ కి ప్రాణహాని కలిగించే అవకాశం ఉన్నందున కేంద్ర ప్రభుత్వం వెంటనే తగు భద్రత కల్పించాలని, మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వహించాలని పాలకొండ జనసేన పార్టీ నాయకులు గొర్ల మన్మధరావు మత్స పుండరీకం, కడగల హరికృష్ణ, పొట్నూర్ రమేష్, జనసేన జాని, ప్రశాంత్ పోరెడ్డి, జామి అనిల్ జన సైనికులు డిమాండ్ చేశారు.