గవర్నర్‌తో ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ భేటీ

అమరావతి : ఏపీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్‌ విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఆ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌తో ఇవాళ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నాలుగు విడతల్లో జరిగిన పంచాయతీ ఎన్నికల తీరును గవర్నర్‌కు ఆయన వివరించారు. అందరి సహకారంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎస్‌ఈసీ పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ చేస్తున్న ఏర్పాట్లను గవర్నర్‌కు తెలిపారు. మార్చి 10న రాష్ట్రంలోని 12 నగర పాలికలు, 75 పురపాలికల్లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.