AP : నేడు జస్టిస్‌ మిశ్రా ప్రమాణం

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా బుధవారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సిజె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాట్లు చేస్తున్నారు. జస్టిస్‌ పికె మిశ్రాతో గవర్నరు విశ్వభూషణ్‌ మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఆదివారం సాయంత్రానికే జస్టిస్‌ మిశ్రా విజయవాడ చేరుకున్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానితుల సంఖ్య పరిమితం చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సిఎం వైఎస్‌ జగన్‌ హాజరుకానున్నారు.