కొత్తవలసలో ఘనంగా అవిర్బావ దినోత్సవం

ఎస్.కోట, జనసేన 11వ అవిర్బావ దినోత్సవం కొత్తవలస రాజా థియేటర్ వద్ద గురువారం సాయంత్రం 7 గంటలకు ఘనంగా జరిగింది. ఈ సభకు ముఖ్య అతిధులుగా జనసీన జిల్లా నాయకులు గురాన అయ్యలు, ముక్క శ్రీనివాసరావు విచ్చేశారు. గోరపల్లి బ్రదర్స్ రవి చినబాబు అధ్వర్యంలో జరిగిన సభకు రామెళ్ళ శివాజీ అధ్యక్షత వహించారు. సభలో జనసేన నియోజకవర్గ నాయకులు వబ్బిన సన్యాసి నాయుడు వైసీపీని ఎందుకు ఓడించాలని జనసేన-బీజేపీ-టీడీపీ కూటమిని ఎందుకు గెలిపించాలి వివరిస్తూ జగన్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎలాంటి అభివృద్ధి చేయకుండా సంక్షేమ పేరుతో రస్త్రన్ని తకట్టులో పెట్టిన అప్పులాబిలోకి నెట్టరని కావున వైసీపీనీ ఓడించి బీజేపీ జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించాలని ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమములో కొత్తవలస మండల అధ్యక్షులు గోరపల్లి రవికుమార్, గొరపళ్లి చినబాబు, వేపాడ మండల అద్యక్షులు సుంకర అప్పారావు, ఎస్.కోట మండల అద్యక్షులు కే.రామకోటి ఎల్.కోట మండల నాయకులు అలమండ్ రాంబాబు జామి మండల నాయకులు డేగల ఈశ్వరరావు వీర మహిళ సగుబిండి వెంకటలక్ష్మీ, ఎర్ర వెంకటలక్ష్మీ జాన్నపల్లి సత్తిబాబు, మల్ల రాజు, గుమ్మిడి శన్కర్ శ్రీనివాస రజు పలువురు జనసైనికులు పాల్గొన్నారు.