బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారెంటీ

తిరుపతిలో సోమవారం కొర్లగుంట ఏడవ డివిజన్ జనసేన అధ్యక్షుడు సాయి ఆధ్వర్యంలో టిడిపి మహిళా నేతలు స్థానికులతో కలిసి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నగర అధ్యక్షుడు రాజారెడ్డి, టిడిపి మహిళా అధ్యక్షురాలు బ్యాంకు శాంతమ్మ ఇతర నాయకులు మాట్లాడుతూ బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అనే కార్యక్రమం ద్వారా మేము మీకు ఒక నమ్మకాన్ని భరోసాన్ని కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, రేపు రాబోయే టిడిపి, జనసేన ఉమ్మడి ప్రభుత్వంలో అష్ట కష్టాలు పడుతున్న రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరుగుతుందని, మీకు ఏ సమస్య వచ్చినా జనసేన-టిడిపి అండగా ఉంటుందని, మూడు నెలలలో వైసీపీ పాలన నుంచి ప్రజలకు విముక్తి కలుగుతుందని, తిరుపతిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు ఎవరికి ఇచ్చినా సరే వారిని కచ్చితంగా గెలిపించుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని టిడిపి జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన టిడిపి నాయకులు.. ఆకేపాటి సుభాషిని, లక్ష్మి, డాక్టర్ జాహ్నవి, స్వప్న ప్రియ, దుర్గాదేవి, చందన, కొండా రాజమోహన్, రమేష్ నాయుడు, హేమంత్, మునస్వామి, పురుషోత్తం, ఆది, నవీన్, వెంకటేష్, బాలాజీ, బాలు, భాషా, సుబ్బు తదితరులు పాల్గొన్నారు.