పలుకుటుంబాలను పరామర్శించిన బత్తుల

రాజానగరం, సీతానగరం మండలంలో పలు కుటుంబాలను జనసేన పార్టీ మహిళా సాధికార కమిటీ కో-ఆర్డినేటర్, నా సేన కోసం నా వంతు కో-ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పరామర్శించడం జరిగింది. సీతానగరం గ్రామంలో దొమ్మేటి ఎస్.కుమార్ గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. రాపాక గ్రామంలో సుందరపల్లి రావణమ్మ ఇటీవల స్వర్గస్తులైన విషయం తెలుసుకుని వారి కుటుంబసభ్యులను పరామర్శించి మనోధైర్యం చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.