జనసేనలో చేరికలు

పూతలపట్టు నియోజకవర్గం, ఐరాల మండలం మండలం, దొమ్మరపల్లి గ్ర్రమంలో పలువురు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలు మరియు జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగింది. వీరికి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ మరియు జిల్లా కార్యదర్శి
ఏపి శివయ్య జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూతలపట్టు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్, జిల్లా కార్యదర్శి ఏపి శివయ్య, ఐరాల మండల అధ్యక్షులు కె.పురుషోత్తం, మండల కార్యదర్శిలు రెడ్డప్ప, మహాలక్ష్మి నాగార్జున, ఈశ్వర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.