నావెంట వచ్చిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటా: బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ నన్ను నమ్మి కూటమితో నడిచిన ప్రతి ఒక్కరికి అండగా ఉంటానని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి, జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం ఆవరణంలో సోమవారం బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ ఆధ్వర్యంలో నిర్వహించిన జనసేన-టిడిపి-బిజెపి సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార మతంతో స్థానిక వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పార్టీ మారే వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఎవరు ఆ బెదిరింపులకు జంక్ వద్దని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో తాడేపల్లిగూడెంలో గెలిచేది జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీల ఉమ్మడి అభ్యర్థి అని, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది కూటమి మాత్రమేనని ఇవి ప్రజలు ఎప్పుడో నిర్ణయించేసారని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి కూడా రాష్ట్రంలో పెద్దన్న పాత్ర వహించాలని ఐదేళ్లు అరాచక పాలనలో మగ్గిపోయిన రాష్ట్రానికి అండగా నిలవాలని ఆయన కోరారు. స్థానిక మంత్రి కొట్టు సత్యనారాయణ అవినీతి అనకొండగా మారి ప్రజలను అడుగడుగునా బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. పార్టీ అధికారం మారకముందే ఎన్నికల కోడ్ వచ్చిందని ప్రజలంతా ఈ అవినీతి పాలన నుంచి ఊపిరి పీల్చుకున్నారన్నారు. పార్లమెంట్లో బిజెపి పార్టీని, అసెంబ్లీలో జనసేన పార్టీని భారీ మెజార్టీతో గెలిపించే బాధ్యత కార్యకర్తలు తీసుకోవాలని కోరారు.

  • వాలంటీర్లు కొమ్ము కాయొద్దు: టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి

వాలంటీర్లు వైసిపి పార్టీ కార్యకర్తలుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారని వైసిపి కోసం పనిచేసేవారిని మేం ప్రశ్నిస్తున్నాం తప్ప వాలంటీర్లు అందరినీ ప్రశ్నించడం లేదని టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ వలవల బాబ్జి పేర్కొన్నారు. వాలంటీర్ల పదవీకాలం ముగుస్తుందని ఆ పార్టీ చెప్పకుండా వాలంటీర్లను మోసం చేస్తుందని దీన్ని వాలంటీర్లంతా గుర్తించాలని పేర్కొన్నారు. వాలంటీర్లపై ఏం చీరలు తీసుకున్న ఈసీ చీరలే తప్ప తమకు సంబంధం లేదు అన్నారు. మూడు పార్టీల నాయకులు కలిసి అన్ని ప్రాంతాల్లో ఓటర్లను కార్యకర్తలను సమన్వయం చేసి జిల్లాలోనే భారీ మెజార్టీ వచ్చేలా పనిచేయాలని ఆకాంక్షించారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అని వారి కారణాలవల్ల వేరే సమావేశంలో ఉన్నా కూడా మేమంతా బాధ్యత తీసుకుని బొలిశెట్టి శ్రీనివాసుని గెలిపిస్తామని పేర్కొన్నారు.

  • బాధ్యత మాది: బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ

రాష్ట్రంలో కూటమి, దేశంలో బిజెపి అధికారం తధ్యమని బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ పేర్కొన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ల సారధ్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని ప్రజల విశ్వసిస్తున్నారన్నారు. దీనికి మూడు పార్టీల నాయకులు కార్యకర్తలు బలంగా పనిచేసే ప్రజల మనోభావాలను తెలుసుకొని ముందుకు వెళ్దామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన-బిజెపి-టిడిపి మూడు పార్టీల ముఖ్య నాయకులు హాజరై పార్టీల బలాబలాలను సమీక్షించి ప్రచారంలో ఏ విధంగా ముందుకు వెళ్లాలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఉమ్మడి నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.