ఒక్కసారి నమ్మి జనసేనను ఆదరించండి: రాటాల రామయ్య

ఒంటిమిట్ట: కుల మతాలకు అతీతమైన పార్టీ జనసేన పార్టీ అని ఒక్కసారి నమ్మి జనసేనను ఆదరించాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు శనివారం ఒంటిమిట్ట మండల పరిధిలోని రాచపల్లి ఎస్సీ కాలనీ గ్రామాల్లో 52 వరోజు ఇంటింటికి జనసేన పవనన్న ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలతో మాట్లాడి పలు సమస్యలను అడిగితెలుసుకున్నారు. జనసేన పార్టీ అధినేత రూపొందించిన మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈసందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ, పేద, బడుగు, బలహీన మధ్యతరగతి కుటుంబాల సంక్షేమమే ధ్యేయంగా జనసేన పార్టీ కృషి చేస్తుందన్నారు. వైసిపి అరాచక పాలనను ప్రజలు దృష్టిలో పెట్టుకొని రానున్న 2024 ఎన్నికల్లో ఒక్కసారి నమ్మి జనసేనను ప్రజలందరూ, ఆదరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు మరియు పాల్గొన్నారు.