యడమ రాజేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ

పఠాన్ చెరువు: తెలంగాణ ఎన్నికల కసరత్తులో భాగంగా పఠాన్ చెరువు నియోజకవర్గ కార్యనిర్వాహక సభ్యులు యడమ రాజేష్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ మరియు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ప్రసంగిస్తూ నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, బూత్ స్థాయి కమిటీ ఏర్పాటు మరియు ప్రభుత్వ వైఫల్యాల గురించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలని సూచనలు చేశారు. పర్యవేక్షణ బృందం సభ్యులు దామోదర్ రెడ్డి, సురేష్ రెడ్డి, లిఖిత పాల్గొని రాబోయే ఎన్నికల కొరకు జన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు.