నేడు బీజేపీ నేత వనతి శ్రీనివాసన్ రోడ్ షో

జీహెచ్ఎంసీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ రోజు రోజుకూ తమ ప్రచారంలో స్పీడ్ పెంచుతుంది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా మోర్చా జతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ ఈరోజు హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఆమె అమీర్ పేట్ , బేగంపేట్, అల్వాల్లో రోడ్ షోలు చేయనున్నారు. రేపు(గురువారం) తమిళ సంఘాల ప్రతినిధులతో సమావేశం కానున్నారు. గురువారం సాయంత్రం వివిధ ప్రాంతాల్లో వనతి శ్రీనివాసన్ రోడ్ షోలు చేయనున్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు రాక నేపథ్యంలో బీజేపీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.