కృష్ణాజిల్లా మత్స్యకార గ్రామాలలో బొమ్మడి నాయకర్ పర్యటన

  • మత్స్యకారుల అభివృద్ధికి జనసేన నిరంతర కృషి..

అవనిగడ్డ నియోజకవర్గం మత్స్యకార గ్రామాలలో పర్యటించిన జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జ్, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కమిటీ చైర్మన్ బొమ్మిడి నాయకర్ కు అవనిగడ్డ నియోజకవర్గం జనసేన పార్టీనాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికి, భారీ ర్యాలీ నిర్వహించారు. పర్యటనలో భాగంగా నాగాయలంక శ్రీ రామ పాద క్షేత్రం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో బోమ్మిడి నాయకర్ మాట్లాడుతూ.. కుల, మత భేద అభిప్రాయం లేకుండా జనసేన పార్టీ అభివృద్ధి నియంత్రణ కృషి చేయాలని తెలిపారు.. మత్స్యకారులకు జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్, పశ్చిమగోదావరి జిల్లా, నరసాపురంలో నిర్వహించిన సభలో మత్స్యకారులకు ఇచ్చిన భరోసాను మనందరం చూసామని అన్నారు.. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ నియోజకవర్గం పార్టీ మండల అధ్యక్షులు, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు మత్తి వెంకటేశ్వరరావు, గుడివాడ శేషుబాబు, మర్రే మరి గంగయ్య చింత వెంకటేశ్వరరావు, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ సభ్యులు వనమాల శ్రీను, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.