బోరు బాగుచేయించిన 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు సత్యనారాయణపురం గ్రామం, ఎల్.కేశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు చాలా రోజుల నుండి మంచినీళ్లు బోరు పాడైందని, 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి కి తెలియజేశారు. సమస్య చెప్పిన 24 గంటల్లో మంచి నీళ్ల బోర్ కి కావలసిన సామగ్రిని, తక్షణమే రప్పించి సిబ్బందితో దగ్గరుండి పని పూర్తి చేయించారు. స్థానిక పెద్దలు కార్పొరేటర్ గోవిందరెడ్డి ని అభినందించారు. ఈ కార్యక్రమంలో సీతారాం, కేశ్వర రావు, సంతోష్ రెడ్డి, ఉమామహేష్, రవిబాబు, అప్పారావు, మోహన్ రావు, రాము, వెంకట అప్పారావు, జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య తదితరులు పాల్గొన్నారు.