మెడికల్ క్యాంపును సందర్శించిన బొర్రా

సత్తెనపల్లి నియోజకవర్గం, నకరికల్లు మండలం, కుంకలగుంట గ్రామంలో గత కొన్ని రోజులుగా జ్వరాలు వచ్చి కాళ్ళు, చేతులు నొప్పి వాపులతో ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కుంకలగుంట గ్రామ జనసేన పార్టీ వారు స్పందించి పల్నాడు జిల్లా కలెక్టర్ ని కలిసి వారికి అర్జీ ఇవ్వగా జెసి డి.ఎం.హెచ్.ఓకి మెడికల్ క్యాంపు నిర్వహించమని ఆదేశించగా గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న ఈ క్యాంపుకు సత్తెనపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావు సందర్శించి డాక్టర్ తో మాట్లాడి రక్త పరీక్షలు గురించి అలాగే రోగులను పరామర్శించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కొమ్మిశెట్టి వెంకట సాంబశివరావు, షేక్ రఫీ, జడా అనిల్, నాదెండ్ల నాగేశ్వరరావు, అంపిర్యాని రాజశేఖర్, చిలకా పూర్ణ, గ్రామ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.