వైసీపీకి షాక్- జనసేనలో చేరిన దళిత సోదరులు

  • రాజానగరం నియోజకవర్గంలో జనసేన టిడిపి కూటమికి జై కొడుతున్న దళిత సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలు
  • రాజానగరం మండలం, పల్లకడియం గ్రామంలో పలువురు యువనేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి… “బత్తుల’ సమక్షంలో జనసేన పార్టీలో చేరిక

రాజానగరం నియోజకవర్గం: రాజానగరంలో వైసిపి నుండి జనసేన పార్టీలో ప్రభంజనంలా వరుస చేరికలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా “బత్తుల” మాట్లాడుతూ.. వైసిపి గెలుపు కోసం పనిచేసిన పాపానికి దళితులు అన్ని రకాలుగా వెనకబడి ఇప్పుడు నరకం అనుభవిస్తున్నారు.! దళిత సోదరుల ఓట్లతో గద్దెనెక్కి, ఇసుక అక్రమ రవాణా ప్రశ్నించినందుకు దళిత సోదరుడికి శిరోముండనం చేయించింది రాజానగరం నియోజకవర్గ వైసీపీ నేతలు కాదా..? దళితుల అభ్యున్నతికై అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది జగన్ రెడ్డి సర్కారు కాదా? రాజానగరం మండలం (నియోజకవర్గం), పల్లకడియం గ్రామంలో.. జనసేన, టిడిపికి మద్దతు పలుకుతూ.. రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ శ్రీ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో 50 మంది దళిత సోదరులు జనసేన పార్టీలో చేరారు. పార్టీలో జాయిన్ అయిన వారందరికీ జనసేన కండువాలు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు “బత్తుల”. పార్టీలో చేరిన వారిలో వేమవరపు వెంకటేష్, వేమవరపు సుబ్రహ్మణ్యం, విస్కోటి సురేష్, రొక్కాల అజయ్, బొర్రా గోపాలం, సన్నపు సురేంద్ర, ఇజ్జన వీరబాబు, కొండ సత్తిబాబు, గంగులూరి చంద్రశేఖర్, గంగులురి సంతోష్, ఈలి వీరబాబు, కాలి బద్రి, పుట్టి రమణ, బొర్రా చినబాబు, గెడ్డం శ్రీను, రొక్కాల సుబ్బారావు, వేమవరపు నారాయణ, వేమవరపు సురేష్, వేమవరపు సుభాష్, కొండా వెంకన్న, విప్పర్తి శ్రీను, వేమవరపు నాగరాజు, గెడ్డం సూరిబాబు, గెడ్డం వినయ్ మరియు ఇతరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.