నివర్‌ నష్టాన్ని అంచనా వేసేందుకు తమిళనాడుకు కేంద్ర బృందం

నివర్‌ తుపాను నష్టాన్ని అంచనా వేసేందుకు నేడు తమిళనాడుకు కేంద్ర బృందం రానుంది. కేంద్ర హోం శాఖ సంయుక్త కార్యదర్శి అశుతోష్‌ అగ్నిహోత్రి నేతృత్వంలో ఏడుగురు అధికారుల బృందం రేపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి షణ్ముగంతో భేటీ కానుంది. అనంతరం తుపాను ప్రభావిత ప్రాంతాల్లో అధికార బృందం పర్యటించనుంది. ఆ తర్వాత ముఖ్యమంత్రి పళనిస్వామితో సమావేశం కానుంది.