చింతామణి జనసేన ఆర్మీ సేవా ట్రస్ట్ సభ్యులను సన్మానించిన లయన్స్ క్లబ్

కర్ణాటక, చింతామణి, లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మనోహర్ నంబియార్ అదేవిధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చింతామణి ప్రెసిడెంట్ శరత్ ఆధ్వర్యంలో చింతామణి జనసేన ఆర్మీ సేవా ట్రస్ట్ మంగళవారం 175 యూనిట్స్ బ్లడ్, అదే విధంగా ఈ సంవత్సరం మొత్తానికి 494 యూనిట్స్ బ్లడ్ డొనేట్ చేసినందుకుగాను చింతామణి జనసేన ఆర్మీ సేవా ట్రస్ట్ ప్రెసిడెంట్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ గిడ్డు, సుబ్బు, కుమార, సునీల్, నరసింహ మురళి, వెంకట్, లయన్స్ క్లబ్ ఆఫ్ చింతామణి రాజేష్, వెంకటరమణ లను లయన్స్ క్లబ్ వారు సన్మానించడం జరిగింది. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి, వారి అడుగుజాడల్లో సమాజానికి సేవ చేస్తున్న చింతామణి జనసేన ఆర్మీ సేవా ట్రస్ట్ లోని ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్ వారి తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.