సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు గృహ నిర్మాణం

రాజమండ్రి: సాటిలైట్ సిటీ గ్రామంలో అగ్ని ప్రమాద బాధితులకు తదేకం ఫౌండేషన్ మరియు జనసేన పార్టీ నాయకులు సహకారంతో స్థానిక జనసైనికులు గృహ నిర్మాణం చేశారు. ఆ గృహ నిర్మాణానికి శుక్రవారం జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ చేతుల మీదుగా గృహప్రవేశం చేయడం జరిగింది. అనంతరం జరిగిన సభలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ సమక్షంలో పెద్ద ఎత్తులో యువతీ యువకులు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ పేదవాడి కంట కన్నీరు తుడవడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని, రాష్ట్ర అభివృద్ధి పవన్ కళ్యాణ్ గారి ద్యేయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజమండ్రి నగర అధ్యక్షులు వై శ్రీను, తూర్పుగోదావరి జిల్లా నాయకులు జామి సత్యనారాయణ, రాజమండ్రి నగర నాయకులు భాషా, రాజమండ్రి రూరల్ మండల అధ్యక్షులు చప్పా చిన్నారావు, మట్టపర్తి నాగరాజు, మండలం ప్రధాన కార్యదర్శి సిహెచ్ సునీల్, మండల కార్యదర్శి దీప్తి మహంతి సుబ్బారావు, సాటిలైట్ సిటీ గ్రామ అధ్యక్షులు గొడిసి పూడి నాగేంద్ర బాబు, ఉపాధ్యక్షులు పీతల సూరిబాబు, ఉపాధ్యక్షులు పోలూరి శ్రీను, ప్రధాన కార్యదర్శి ఎలుగుబంటి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి పాలవలస గోపి, ప్రధాన కార్యదర్శి అన్యం సుబ్రహ్మణ్యం, కార్యదర్శి కొల్లాటి సతీష్, కార్యదర్శి సేలం సురేష్, కార్యదర్శి కాజా శివరామకృష్ణ యూత్ ప్రెసిడెంట్ బోరా అప్పలనాయుడు, సేసెట్టి ప్రసాద్ బాబు, ప్రసాద్, మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొనడం జరిగింది.