నిరాహారదీక్షకు దిగిన అన్నదాతలు..

దేశ రాజధానిలో అన్నదాతల ఆందోళన ఉగ్రరూపం దాల్చింది. నేడు గాంధీ వర్థంతి సందర్భంగా.. సద్భావనా దివస్‌ను పాటించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. శనివారం సాయంత్రం 5 గంటల వరకు ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు నిరాహార దీక్షకు దిగారు. ఢిల్లీలో రైతుల శాంతియుత ర్యాలీకి సంఘీభావంగా ఎపి రాష్ట్రవ్యాప్తంగా రైతులు నిరాహార దీక్షలు చేపడుతున్నారు.