నందవరం జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

కర్నూలు జిల్లా: అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రోడ్ల దుస్థితిని తెలియచేస్తూ #GoodMorningCMsir కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా, ఎమ్మిగనురు నియోజకవర్గ పరిధిలోని నందవరం మండలంలో ఇబ్రహీంపురం రోడ్, చిన్న కోతిలి గ్రామం, పెద్ద కోతిలి గ్రామం, జోలాపురం గ్రామం మరియు నాగలదిన్నె గ్రామం రోడ్డు పరిస్థితులను తెలియచేస్తూ జనసేన నాయకులు జిల్లా వరుణ్ మాట్లాడుతూ.. రోడ్లు చాలా ప్రమాదకరంగా మారాయని.. ప్రభుత్వం వీటిని వెంటనే బాగు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రయాణికులు కానీ.. గర్భవతులు కానీ ముసలి వాళ్ళ కానీ.. వాహనదారులు కానీ ప్రయాణించేందుకు చాలా కష్టంగా మారింది. చాలా ప్రమాదాలు జరుగుతున్నాయని.. కావున రాష్ట్ర ప్రభుత్వం రోడ్ల కు ఏవైతే నిధులు కేటాయించింది జగన్ రెడ్డి గారు మేలుకొని వెంటనే రహదారి మరమ్మతులు చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందవరం మండలం నాయకులు ప్రసాద్, నరసప్ప, శ్రీను, భీమా, బసవరాజ్ లింగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.