కర్నూల్ జనసేన ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కర్నూల్: కర్నూల్ జిల్లాలో జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం పాణ్యం నియోజకవర్గ ఇంచార్జి చింతా సురేష్ బాబు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యనాయకులు జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి షైక్ నయుబ్ కమల్, వీర మహిళ జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకెపాటి సుభాషిణి, జనసేన పార్టీ మత్స్యకార విభాగ రాష్ట్ర కార్యదర్శి టి గోవింద రాజులు, రాయలసీమ ప్రాంతీయ కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీమతి హసీనా బేగం, ఐటీ వింగ్ కో ఆర్డినేటర్ లక్ష్మీ కాంత్ విచ్చేసారు. ఈ కార్యక్రమంలో కల్లూరు, ఓర్వకల్ మండల వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.