నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో వరద బాధిత కుటుంబాలకు బియ్యం పంపిణీ

నెల్లూరు జిల్లా, జలప్రళయంతో దెబ్బ తిని కష్టాల్లో ఉన్న ప్రజలకు జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ స్పూర్తితో మరియు జనసేన పార్టీ పిఏసి చైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల కో ఆర్డినేటర్ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాసరావు(క్క్) ఆదేశానుసారం ఇందుకూరుపేట మండలం, గంగపట్నం గ్రామములో నంద్యాల జనసేన పార్టీ ఆధ్వర్యంలో 100 కుటుంబాలకు సరిపడ 500క్గ్ల బియ్యం, నూనె, కందిపప్పు, కారంపొడి, ఉప్పు, సబ్బులు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి వై.విశ్వనాథ్, నంద్యాల జనసేన పార్టీ జనసైనికుల సహాయ సహకారాలతో పంపిణి చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శులు కొట్టే వెంకటేశ్వర్లు, కేతుబోయిన సురేష్ బాబు మరియు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు జి. కిషోర్, హరి రెడ్డి, అజయ్ కుమార్ శ్రీనివాస్ రెడ్డి, సుధీర్ ప్రవీణ్ కుమార్ శ్రీకాంత్ ప్రశాంత్ బాలాజీ రమేశ్ కేశవ్, చిన్నాజనసేన పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయటం జరిగింది.