వీరపురెడ్డి మంగతాయారుని పరామర్శించిన డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజకవర్గం, విరవాడ గ్రామానికి చెందినటువంటి మన జనసైనికుడు వీరపురెడ్డి హరీష్ తల్లి వీరపురెడ్డి మంగతాయారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, ఆక్సిజన్ కాన్సెంట్రేట్ తో చికిత్స పొందుతున్నటువంటి మంగతాయారుని పిఠాపురం నియోజకవర్గ జనసేన నాయకులు మరియు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ పిల్లా శ్రీధర్ పరామర్శించి వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా అడిగి తెలుసుకుని తగిన సలహాలు సూచనలను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జవ్వాదుల గోవింద్, కూరాకుల వీరబాబు, రామిశెట్టి సూరిబాబు, దిబిడి కృష్ణ, అమరాధి రాము, కమ్మనీడి నరేష్, గట్టెం భీమరాజు, రామిశెట్టి శివరామదాసు, దాసం పట్టాభి, గోన శ్రీను, పల్నాటి మధుబాబు, బిజెపి నాయకులు పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.