Drushyam 2: ఈ నెల 25న.. అమెజాన్ ప్రైమ్ లో!

వెంకటేశ్ కథానాయకుడిగా గతంలో వచ్చిన ‘దృశ్యం’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. పెద్దగా చదువుకోని ఒక మధ్యతరగతి కుటుంబీకుడు, ఒక హత్యానేరం నుంచి తన భార్య బిడ్డలను ఎలా కాపాడుకున్నాడు? అనేదే కథ. ఈ కథ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ కావడంతో భారీ వసూళ్లను రాబట్టింది.

ఇప్పుడు అదే నటీనటులతో ‘దృశ్యం 2’ సినిమాను రూపొందించారు. మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానుంది. నిన్న రాత్రి ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ను కూడా నిర్వహించారు.

ఈ  కార్యక్రమంలో వెంకటేశ్ .. మీనా .. నరేశ్ .. సంపత్ రాజు .. శ్రీప్రియలతో పాటు, దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.’దృశ్యం’ సినిమాకి మించి ఈ సినిమా ఆసక్తిని పెంచుతుందనీ, తప్పకుండా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.