IND vs ENG 3rd ODI:టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

భారత్‌-ఇంగ్లండ్ మధ్య చివరి వన్డే లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే ఆ టీమ్‌ సిరీస్ ను కైవసం చేసుకోవచ్చు. తొలి వన్డేలో భారత్ గెలవగా, రెండో వన్డేలో ఇంగ్లండ్ గెలిచిన విషయం తెలిసిందే. ఇరు జట్లు 1-1తో సమంగా ఉండగా ఈ పోరు విజేత ఎవరూ అనేది నిర్ణయిస్తోంది. ఈ మ్యాచ్‌లో కుల్దీప్‌ స్థానంలో భారత్ నటరాజన్‌కు చోటు కల్పించింది. భారత్ జట్టులో శిఖర్‌ ధావన్, శార్దుల్ ఠాకూర్‌, హార్దిక్ పాండ్యా, విరాట్‌ కోహ్లి, రోహిత్ శర్మ, నటరాజన్‌, ప్రసిద్ధ్ కృష్ణ, పంత్‌, భువనేశ్వర్ కుమార్, కేఎల్‌ రాహుల్, కృనాల్ ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *