ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి: అనుశ్రీ సత్యనారాయణ

  • అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా ఓటు అవగాహనా సదస్సు

రాజమండ్రి సిటి, స్థానిక వీటి కాలేజ్ వద్ద జనసేన ఆధ్వర్యంలో ఓటు అవగాహన మరియు నమోదు సదస్సు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ యువ నాయకులు బయ్యపు నీడి సూర్య ఆహ్వానం మేరకు జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటు హక్కు అనేది చాలా విలువైనది ఓటు హక్కు ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, విద్యార్థులకి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శిలు పైడిరాజు, నల్లంశెట్టి వీరబాబు కార్యదర్శి విన్న వాసు, జాయింట్ సెక్రెటరీ దేవకివాడి చక్రపాణి, జనసేన వీరమహిళ కళ్యాణి సాయి, విక్టరీ వాసు, సూర్య మిత్ర బృందం, జనసైనికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.