గంగూలీ తాజా హెల్త్ బులిటెన్

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదలైంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు ప్రకటించారు. సర్జరీ అనంతరం సాధారణ స్థితికి చేరుకున్నారని చెప్పుకొచ్చారు. తాజాగా గంగూలీకి కరోనా టెస్టులు నిర్వహించగా రిపోర్టులో నెగటివ్ వచ్చిందని.. ఎలాంటి జ్వరం కూడా లేదని వైద్యులు తెలిపారు. అటు ఈసీజీ, పల్స్ రేట్ నార్మల్‌కు వచ్చాయని పేర్కొన్నారు.

కాగా, శుక్రవారం సాయంత్రం గంగూలీ గుండెపోటుతో కోల్‌కతాలోని వుడ్‌ల్యాండ్స్ ఆసుపత్రిలో చేరిన సంగతి విదితమే. పరీక్షలు నిర్వహించిన అనంతరం వైద్యులు దాదాకు యాంజియోప్లాస్టీ చేశారు. గంగూలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు, పలువురు సెలబ్రిటీలు పూజలు చేస్తున్నారు.