Palakonda: ప్రజలకు భరోసా ఇచ్చిన గర్భాన సత్తిబాబు

పాలకొండ పరిసర ప్రాంతంలో జనసంచారంలో గోడగల వీధి చివర ఉన్న డంపింగ్ యార్డ్ గత 3 సంవత్సరాలుగా తొలిగించాలని స్థానికులు ధర్నాలు చేశారు మరియు మున్సిపాలిటీ అధికారులకు ఎన్నోసార్లు విన్నపాలు చేసారు. అధికార ప్రభుత్వ నాయకులకి వివరించినా ఏ ఒక్కరు కూడా ఇంత వరకు స్పందించలేదు. ఇది జనసేన పార్టీ దృష్టికి తీసుకువచ్చారు, పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ గర్భాన సత్తిబాబు డంపింగ్ యార్డ్ ని సందర్శించడం జరిగింది. అక్కడ ప్రజల బాధలను, ఇబ్బందులును తెలుసుకోవటం జరిగింది. ఈ డంపింగ్ యార్డ్ వల్ల పరిసర ప్రాంత ప్రజలు వ్యాధులకు గురికావడం జరుగుతుంది కావున అక్కడ నినాదాలు చేస్తూ ప్రజలకు భరోసా ఇవ్వడం జరిగింది.ఈ సమస్య పరిష్కారం చూపించకపోతే నిరాహారదీక్షకు కూడా సిద్ధంగా ఉన్నామని స్థానిక ప్రజలకు భరోసా ఇవ్వటం జరిగింది.