Yemmiganur: వర్షాలతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్

ఎమ్మిగనూరు నియోజకవర్గం, భారీ వర్షాలు కురవడంతో నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నో నెలలు కష్టపడి పండించిన ధాన్యం అకాల వర్షానికి తడిసిపోయింది రైతులు ఆందోళన చెందుతున్నారని తడిసిన ధాన్యంను ప్రభుత్వం కొనుగోలు చేసి ఆందోళనలో ఉన్న రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా నిలిచి భరోసాని కల్పించాలని లేనిపక్షంలో నష్టపోయిన రైతుల పక్షాన నిలబడి పోరాడడానికి జనసేన పార్టీ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని హెచ్చరించారు.