జయలక్ష్మి బ్యాంకు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి: డాక్టర్ పిల్లా శ్రీధర్

పిఠాపురం, జయలక్ష్మి బ్యాంకు బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ జయలక్ష్మి బ్యాంకు బాధితుల సమస్యలను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొని వెళ్తానని బాధితులకు జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు తెలియజేశారు. ఒక్క పిఠాపురం జయలక్ష్మి బ్యాంకు బ్రాంచ్ కి సంబంధించి సుమారు 16 కోట్ల రూపాయలు డిపాజిట్ దారులకు చెల్లించాలని సుమారు 1200 మంది డిపాజిట్ దారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.