ఒంగోలు జాతి ఎడ్ల బళ్ళ ప్రదర్శన పోస్టర్ ఆవిష్కరణ

కాకినాడ, జనసేన పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ని, పార్టీ జనరల్ సెక్రెటరీ కొణిదెల నాగబాబుని దర్శి నియోజకవర్గ జనసేన నాయకులు గరికిపాటి వెంకట్ మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతులమీదగా జనవరి 6, 7, 8, 9, తేదీలలో ప్రకాశం జిల్లా, దర్శిలో ఘనంగా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బళ్ళ ప్రదర్శన కార్యక్రమ పోస్టర్ లాంచ్ చేయించి వారిని కార్యక్రమానికి సగౌరవంగా ఆహ్వానించడం జరిగింది. అనంతరం దర్శి నియోజకవర్గ తదుపరి కార్యాచరణ గురించి చర్చించి, వారి సలహాలు సూచనలు తీసుకోవడం జరిగింది.