భారీ బైక్ ర్యాలీలో పాల్గొన్న నేమూరి శంకర్ గౌడ్

తెలంగాణ, తాండూరు నియోజకవర్గంలో జనసేన-బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ నేతృత్వంలో జనసేన-బీజేపీ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విలియం మూన్ పాఠశాల నుంచి ఇందిరానగర్, సీసీఐ కాలనీ, శివాజీచౌక్, వాల్మీకినగర్, గాంధీ చౌక్, భద్రప్ప ఆలయం, పాత తాండూరు, సాయిపూర్ మీదుగా జేఎంఎస్ గార్డెన్ హైదరాబాద్ రోడ్డు వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రచారంలో భాగంగా అందరికి అభివాదం చేస్తూ జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసుపై తమ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిజేపి నాయకులు, కార్యకర్తలు, జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.