నోముల అంత్యక్రియల్లో పాల్గొననున్న కేసీఆర్

రేపు నకిరేకల్ మండలం పాలెం గ్రామనికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. కాగా.. నార్కెట్‌పల్లి కామినేని ఆసుపత్రిలో నోముల నర్సింహయ్య భౌతికకాయాన్ని భద్రపరిచారు. ఇవాళ రాత్రికి అమెరికా నుంచి ఆయన చిన్న కూతురు జ్యోతి రానున్నారు. రేపు నోముల స్వగ్రామమైన నకేరేకల్ మండలం పాలెం గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.